Ads 468x60px

facebook

sada mee sevalo

Tuesday 23 December 2014

* అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.

* అలాగే నాలుగు మూలలు.
ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం
తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం
ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు
దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు
నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు
పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి
వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక
ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం
ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం
* అష్ట దిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా

తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.

* అలాగే నాలుగు మూలలు.

ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం

ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...

దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం

తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం

ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు

దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు

నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు

పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి

వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక

ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం

ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం

ఆలయానికి వెళ్తున్నారా..? అయితే ఇవన్నీ తప్పనిసరి!

1. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
2. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
3. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
4. జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
5. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
6. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
7. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
8. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
9. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
10. ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
11. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
12. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
13. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
14. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
15. ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
16. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
17. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
18. మూల విరాట్‌ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
19. ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.
20. ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
21. గోపుర దర్శనం తప్పక చేయాలి.
22. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
23. ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
24. మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

తిరుపతి లడ్డు

* తిరుపతి లడ్డు
లడ్డు పేరు చేబితే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి లడ్డు.లడ్డూలంటే మన తిరుపతి లడ్డూలే ఆరుచి మన నాలుకను చేరుకొగానే మనసంతా ఒక్కసారి భక్తిభావంతో పులకరించి మయమరుస్తుంది.శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివెన్నున్నా తిరుపతి లడ్డూకున్న గిరాకితో పోలిస్తే ఇవేవి సరిపోవు.
ఎవరెంత కొపంతో ఉన్నా వారికి తిరుపతి లడ్డూ ఇస్తే ఇట్టే కరిగిపొతారు.ఏపని సాదించడానికి అయిన అంతటి బ్రహ్మస్త్రం మన లడ్డూ.పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడేఅ సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలుఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు.ఈ మద్యే మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
* ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.

ఆరోగ్యంగా జీవించండీ. ఆధ్యాత్మికంగా ఎదగండి.

* ఆరోగ్య సూత్రములు
ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము అతను ఆరోగ్యము పట్ల తీసుకొను శ్రద్ధపై ఆదారపడి వుంటుంది. ప్రాణాయామము, ధ్యానములకు పరిపూరకముగా ఇచ్చుట శారీరక, మానసిక ఉన్నతికొరకు కొన్ని ఆరోగ్య సూచనలు తెలియజేయబడినది.
01. అన్ని ఋతువులు నందు స్వచ్చమైన నీరును పీలైనంత ఎక్కువగా ఏమరుపాటు లేకుండా త్రాగండి. నీరు నిజమైన సంజీవని. నీరును బాగుగా తీసుకొనట్లైతే ఆ నీరు రక్తమును పలచన చేసి రక్తనాళములలోనికి రక్తమును సరళముగా ప్రవహింప చేయును. మరియు శరీరములో జరుగు అనేక ప్రక్రియల వల్ల ఉత్పన్నమైన వేడిని బయటకు పంపివేసి శరీరమును చల్లబరుస్తుంది. ఏ విధముగానంటే కారు రేడియేటర్లోని నీరు ఏ విధంగా కారు యంత్రమును చల్లబరుచునో అదే విధముగా మనము త్రాగే నీరు మన శరీరమును చల్లగా వుంచుతుంది.
02. మనము త్రాగే నీరు శరీరములో మిగిలిన మలిన పదార్థములను వెలుపలికి పంపిచేసి శరీరమును ఆరోగ్యముగా, శుభ్రముగా ఉంచుతుంది. శారీరక అనారోగ్యమునకు, అన్ని వ్యాధులకు మూలకారణము ఈ మలిన పదార్థములే. నీరు వీతిని శుభ్ర పరస్తుంది, కావున నీరు త్రాగడం ఒక అలవాటుగా చెసుకోండి. నిద్రపోవుటకు అరగంట ముంది ఒక గ్లాసినిండా నీటిని త్రాగండి. మనము పడుకొన్న తరువాత తిన్న ఆహారము జీర్ణమై దాని సారము రక్తములో చేరి రక్తమును మందము చేయను. ఈ రక్తము మందముగా, జిగురుగా తయారై నందువలన గుండె మామూలుకన్నా ఎక్కువ ఒత్తిడికి గురై పని చేయవలసివస్తుంది. ఈ కారణముచేతనే మధ్యవయస్సులోని వ్యక్తులు, ముసలి తనములోని వ్యక్తులు రాత్రిపూట నిద్రలో గ్ండెపోటుకు గురి అవడ్ం సహజముగా జరుగుతున్నది. కావున రాత్రి నిద్రకు ముందు నీరు త్రాగడం వలన రక్తము పలుచబడి గుండె పై వత్తిడి తగ్గుతుంది మరియు శరీరమును చల్లబరచి మంచి నిద్ర రావాడానికి దోహదమవుతుంది. కావున అన్ని కాలముల యందు నీరు త్రాగడం మంచి అలవాటు.
అల్పాహరమునకు లేక భోజనమునకు ముందు ఒక గ్లాసు నీటిని త్రాగినత్లైతే ఆ నీరు కడుపులో పేరుకొని ఉన్న వాయువును (గ్యాస్) బయటకు పంపిచేయును. మరియు తక్కువ తినునట్లు చెయును. స్థూలకాయమును తగ్గించుకొనుటకు భోజనమునకు ముందు నీరు త్రాగడం మంచి ఉపాయము
అతి ప్రాచీన వైద్య పద్దతి అయిన ఆయుర్వేదము ప్రకారము మట్టి మూకుడు, మట్టిపాత్రలలో వుంచిన నీరును త్రాగినత్లైతే ఆ నీరు మంచి ఆరోగ్యమును ఇచ్చును. ఎందువలననగా ముట్టి పాత్రలకు నీరులో ఉన్న అనవసరపు అయస్కాంత త్రరంగములుగాని విద్యత్ తరంగములుగాని ఉన్నచో అటువంటి వాటిని తనలోనికి ఇముడ్చుకొని స్వచ్చమైన నీటిని మనకు అందించు తత్త్వమును కలిగియున్నవి.
03. మీ అభిరుచికి తగినట్లు భుజించండి. కాని తక్కువ కేలరీలు, ఎక్కువ పేచు పదార్థములు కలిగిన అహారమును భుజించండి.
04. మంచి విటమున్లు కలిగిన కాయగూరలను భుజించండి. ముఖ్యముగా విటమిన్ -సి మరియు వితమిన్ -ఇ కలిగినవి. ఎందుకంటే విటమిన్ -సి సహజముగా సోకే వ్యాధులు(ఉదా - జలుబు) మైదలైన వాటినుంచి ఎక్కువ రోగనిరోధక శక్తినిచ్చి కాపాడుతుంది మరియు విటమిన్ -ఇ శరీరమును తేజోవంతం చేస్తుంది.
05. మరియు కాయగూరలు శరీరమునకు తగినంత ఐరన్ను ఇస్తాయి. ఈ ఐరన్ రక్తహీనతను తగ్గించుటయే గాక రక్తములోని హిమోగ్లోబిన్ శాతమును వృద్ధి చేస్తుంది. రక్తములో ఈ హిమోగ్లోబిన్ శాతము తగ్గినంత ఉన్నప్పుడు మాత్రమే రక్తము ఊపిరితిత్తులలో వున్న ప్రాణవాయువు (ఆక్సిజన్)ను గ్రహించి మొదడుకు మరియు శరీర అవయవములకు చేరవేయును. మీరు ధీర్ఘప్రాణాయమము చేయునపుడు రక్తములో తగినంత హిమోగ్లోబిన్ శాతము లేనట్లెతే మెదడుకు మరియు శరీర అవయవములకు తగినంత ప్రాణవాయువు అందదు. అప్పుడు ధీర్ఘప్రాణాయామము తగినంత ఫలితం ఇప్వదు.
06. మానవ శరీరము పంచభూతములైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వానితో నిర్మితమై యున్నది. అందులో భూమి, ఆకాశము స్థిరముగా వుంటే మిగిలిన అగ్ని, జలము, వాయువు చరిస్తుంటాయి. శరీరములో చరించే మధ్య అసమతౌల్యమేర్పడినట్లయితే అనేక రోగములకు కారణభూతమౌచున్నదని ఆయుర్వేదము తెలియజేయు చున్నది. త్రిఫల చూర్ణము లేదా మాత్రలు ( ఆయుర్వేద మునకు సంబంధిచిన ఓషదుల మిశ్రమము) ప్రతి దినము ప్రొద్దున పరగడుపున ఒక టే స్పూన్ పొడినిగాని లేదా మాత్రలు గాని నీటితో తీసుకొన్నట్లైతే శరీరములోని అగ్ని, జల, వాయువులను నియంత్రించి అనేక శారీరిక రుగ్మతలనుంచి కాపాడుతుంది.
07. త్రిఫలా చూర్ణమును లేదా మాత్రలు ప్రతిదినము తీసుకొన్నట్లైతే అది శరీరములోని ఎముకల కదలికలకు సహకరించుటయే గాక శరీరములో అధికముగా వున్న వేడిని తొలగించి అగ్ని(పిత్త), వాయు(వాత), కఫ(జల)లను నియంత్రించి అనేక రుగ్మతలను దూరం చేస్తుంది.
08. మీరు గనుక సంగీత ప్రీయులైతే మృధు మధురమైన సంగీతమును వినండి. అది మీకు శారీరంగా, మానసికంగా విశ్రాంతిని కలుగజేస్తుంది. రణగొణ శబ్దములతో కూడిన సంగీతము నాడులను ఉద్రేకపరచి శరీరమునకు ఇబ్బంది కలుగజేసి కాలాంతరమందు శరీర అరోగ్యమునకు హానికలిగించును.
09. ఎల్లప్పుడు అర్థవంతంమైన పుస్తకములను చుదువుచున్నట్లైతే అవి మంచి ఙ్నానమును ఇచ్చుటయే కాక ఉన్నతమైన వ్యక్తిత్వమును కలుగుచేయును.
10. కొంచెము దానగుణము వృద్ధిచేసుకొన్నట్లైతే అది మనస్సుకు సంతృప్తి కలుగజేస్తుంది. ఈ దానగుణము వలన జీవితమునకు మంచి సార్థకతను ఏర్చరుస్తుంది.
11. మంచి మరియు సృజనాత్మక ఆలోచనలు (పాజిటివ్ థింకింగ్) మనస్సును ఉన్నతం చేస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరమునకు పునాది వంటింది. ఎందుకంటే మనస్సే శరీరము యొక్క యజమాని కావున. ఉన్నత వ్యక్తిత్వము ఆరోగ్యకరమైన జీవనమునకు చాలా ముఖ్యము.
ఆరోగ్యంగా జీవించండీ. ఆధ్యాత్మికంగా ఎదగండి.

Sunday 23 March 2014

* యక్ష ప్రశ్నలు

* యక్ష ప్రశ్నలు

*మహా భారతం లోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మ రాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలు. వ్యవహారికములో చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన ప్రశ్నలకు పర్యాయంగా యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతారు.

* పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో యిరుక్కొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు
* 72 ప్రశ్నలు-జవాబులు

*ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటె దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి, ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ఞానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)

46. తపస్సు అంటే ఏమిటి? ( తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ఞానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ఞానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ఞానం)

62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన భర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? (సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం? (ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు)

* ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన సంవత్సరాలు

* ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన సంవత్సరాలు
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్న అంతర్జాలం(ఇంటర్నెట్) గురించి అనేక ఆసక్తికర అంశాలను తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. 1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ చరిత్రలో చోటుచేసుకున్న మైలురాళ్లను మీ ముందుంచుతున్నాం...
* ఏవోఎల్ తక్షణ సందేశ సేవలు, ప్రారంభం 1997:
ఈ కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌ను 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఈ కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్‌లను అందిస్తోంది. సంస్థ ప్రధానకార్యాలయం న్యూయార్క్ నగరంలోని 770 బ్రాడ్‌వేలో ఉంది.
* గూగుల్ , ప్రారంభం 1998:
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను 1998లో ప్రారంభించారు. లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు ఈ కంపెనీని స్థాపించారు.
* కొత్త కేబుల్ లైన్‌లు, ప్రారంభం 2000:
కమ్యూనికేషన్ విస్తరణలో భాగంగా కొత్త కేబుల్ లైన్‌లు ఏర్పడ్డాయి. వీటిని ఇతర భూభాగంలోకి సముద్ర మార్గం గుండా వ్యాపింప చేశారు. ఈ ప్రక్రియనే సబ్ మెరైన్ కమ్యూనికేషన్ అంటారు. సముద్ర గర్భాల్లో వినియోగిస్తున్న ఆధునిక వర్షన్ కేబుల్స్ ఫైబర్ టెక్నాలజీని కలిగి డిజిటల్, ఇంటర్నెట్ ఇంకా టెలికమ్యూనికేషన్ డేటాను సెకన్లలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి.
* వికీపీడియా, ప్రారంభం 2000:
వివిధ అంశాలకు సంబంధించిన డాటా వివిధ భాషల్లో ఇక్కడ లభ్యమవుతుంది. ఈ టాపిక్‌లను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. అంతర్జాలంలో వికీపీడియాకు గొప్స స్ధానం ఉంది.
* ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ :
డిజిటల్ వర్షన్‌లో స్టోర్ చేసిన సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసే ప్రక్రియ 2001లో ప్రారంభమైంది. ఇంటర్నెట్ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా భావించవచ్చు.
* స్కైప్, 2003:
నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ఉచిత వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.
* యూట్యూబ్, 2004:
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను అధికారికంగా 2005 నవంబర్‌లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్$1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.
* ఫేస్‌బుక్, 2004:
100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.
* యాపిల్ ఐప్యాడ్ ఆవిష్కరణ, 2010:
పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ యాపిల్ ఐప్యాడ్ పేరుతో సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను ఏప్రిల్3, 2010న ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్లో 4వ తరం ఐప్యాడ్ ఇంకా ఐప్యాడ్ మినీలు లభ్యమవుతున్నాయి.

Dadapeer New Songs

Dadapeer New Songs